చిక్కడపల్లి,సెప్టెంబర్12: తెలంగాణ పోరాట ప్రకంపనలకు వందేండ్లు చరిత్ర ఉందని రాష్ట్ర గ్రంథాలయం సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు.ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని పుస్తకాలయంలో తెలంగాణ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయాచితం శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు అమర యోధుల త్యాగచరిత ‘ధీర’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ చెరుపల్లి సీతరాములు ఆవిష్కరించారు. నవ తెలంగాణ బుక్ హౌస్ మేనేజర్ చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, రఘు, కృష్ణారెడ్డి, సుభాషిని, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.