సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) /బంజారాహిల్స్ : వీధి కుకల ప్రమాదాల నివారణపై నగర వాసులకు జీహెచ్ఎంసీ క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. కుక కాటు నివారణ పద్ధతులు, వీధి కుకల పట్ల ప్రవర్తించాల్సిన తీరుపై సూచనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఆ పై ఏఎంఓహెచ్లు, డీసీ, జోనల్ కమిషనర్ స్థాయి వరకు భాగస్వామ్యం చేస్తున్నారు.
అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలు, స్లమ్ ఏరియా ఫెడరేషన్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 335 పాఠశాలల్లో 80,183 మంది విద్యార్థులకు…అలాగే 174 ఆర్డబ్లూఏ, టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ గ్రూపులకు అవగాహన కల్పించారు. గురువారం 145 పాఠశాలల్లో 29,297 మంది విద్యార్థులకు, 86 టౌన్ లెవల్, స్లమ్ లెవల్ ఫెడరేషన్,లకు అవగాహన కల్పించారు. కాగా బంజారాహిల్స్ లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మేయర్ విజయలక్ష్మి అవగాహన కల్పించారు.