జీడిమెట్ల, మే 30: అర్ధరాత్రి క్యాబ్ను అడ్డగించి డ్రైవర్పై దాడి చేసి.. సాఫ్ట్వేర్ ఉద్యోగులను దోచుకున్నారు దుండగులు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి డ్రైవర్ అనిల్ తన క్యాబ్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి షాపూర్నగర్ నెహ్రూనగర్కు తీసుకెళ్తున్నాడు.
ఈ క్రమంలో గాజులరామారంలోని నెహ్రూనగర్ ప్రధాన రహదారికి చేరుకోగానే మున్నా, రాజాసింగ్, అఖిల్తో పాటు మరో ముగ్గురు దుండగులు మద్యం మత్తులో క్యాబ్ను అడ్డగించారు. ఉద్యోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వారి సెల్ఫోన్, కొంత నగదును లాక్కున్నారు. అనిల్ మెడపై బ్లెడుతో దాడి చేసి గాయపర్చగా, అతడిని చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల సీఐ విజయ్ తెలిపారు.