చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 15:వరుసకు కుమార్తెపై ఓ వ్యక్తి మూ డేండ్లుగా లైంగికదాడి చేస్తున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ.. అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు..గౌస్నగర్లో నివసించే ఓ మహిళకు ఇద్దరు కుమారులు, కుమార్తె(14). కుటుంబ కలహాల కారణంగా భర్త నుంచి విడిపోయి ఇండ్లలో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటున్నది. ఈ క్రమంలో అంబర్పేట్కు చెందిన ఓ పాన్షాపు వ్యాపారి షరీఫ్ యూసుఫ్(45) పరిచయమయ్యాడు. ఇతడికి పెండ్లి అయి… పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ సదరు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. తరచూ గౌస్నగర్కు వచ్చి పోయే వాడు. ఆమె పనికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కుమార్తెపై లైంగికదాడి చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఎవరికైనా చెబితే.. మీ అమ్మతో పాటు నిన్ను చంపేస్తానంటూ బెదిరిస్తూ.. అత్యాచారం చేస్తున్నాడు. ఈనెల 12న కూతురుపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా, గమనించిన తల్లి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపారు.
చార్మినార్, సెప్టెంబర్ 15: వదినను బెదిరించి.. మరిది లైంగిక దాడికి పాల్పడ్డాడు. మీర్చౌక్ పోలీస్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఫయాజ్ అలీ దంపతులు పురాణిహవేలిలో ఉంటున్నారు. ఫయాజ్ సోదరుడు ఇర్ఫాన్ (28) కూడా వీరితో కలిసి ఉంటున్నాడు. అన్న భార్య(26)పై కన్నేసిన ఇర్ఫాన్ ఆమెను బెదిరించి.. అనేకసార్లు అత్యాచారం చేశాడు. ఇర్ఫాన్ ఆగడాలు శృతి మించడంతో బాధితురాలు తన భర్తకు విషయాన్ని చెప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుతకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపారు.
బంజారాహిల్స్, సెప్టెంబర్ 15: ‘టాయిలెట్ ఉందా..’ అంటూ ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చిన గుర్తుతెలియని యువకుడు అక్కడున్న వాచ్మన్ కుమార్తెల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం 3లోని ఓ అపార్ట్మెంట్లోకి ఈ నెల 12న హెల్మెట్ ధరించిన ఓ యువకుడు ప్రవేశించాడు. అక్కడున్న వాచ్మన్ కొడుకును టాయిలెట్ ఉందా అని అడగ్గా..అతడు పార్కింగ్ పక్కన ఉందంటూ.. చూపించి.. వెళ్లిపోయాడు. బాత్ర్రూం నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు.. వాచ్మన్ ఇద్దరు కూతుళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలు కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది. అపార్ట్మెంట్ యజమాని ఖాజా ఆసిఫ్ అహ్మద్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ యువకుడిపై ఐపీసీ 354(ఏ)తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.