సిటీబ్యూరో,మే4 (నమస్తే తెలంగాణ): ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో గురువారం రాత్రి నగరంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జూబ్లీహిల్స్ సర్కిల్ షేక్పేట్లో అత్యధికంగా 4.0 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లి 3.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. డీఆర్ఎఫ్ అత్యవసర సహాయం కోసం 040-29555500 ఫోన్ నంబర్లో సంప్రదించాలని నగర పాలక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.