బంజారాహిల్స్, జూలై 29 : నేటి తరం పిల్లలు సృజనాత్మకతను ప్రదర్శించడంలో చాలా వేగంగా ఉన్నారని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ప్రముఖ దర్శకుడు మారుతి కుమార్తె హియా దాసరి గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ‘ది నోయర్ రెండిజ్వోజ్’ పేరుతో బంజారాహిల్స్లోని పార్క్ హయత్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ను శనివారం నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు. కామిస్ స్టోరీస్లోని జోకర్, బ్యాట్మెన్ లాంటి క్యారెక్టర్లను ఇతివృత్తంగా తీసుకుని హియా వేసిన 71 చిత్రాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, నటుడు ఆనంద్ దేవరకొండ, సంగీత దర్శకుడు థమన్ తదితరులు పాల్గొన్నారు.