నాంపల్లి క్రిమినల్ కోర్ట్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కోర్టుల్లో స్టాండింగ్ కౌన్సిల్స్గా పలువురు న్యాయవాదులు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్టాండింగ్ కౌన్సిల్స్గా న్యాయవాదులు అట్టేల్లి మానిక్ ప్రభు గౌడ్, వల్లంకి ఇంద్రసేనారెడ్డి, ఆలుగడ్డల అనిల్కుమార్, బి.అజయ్, సయ్యద్ సొహైల్, రంగారెడ్డి జిల్లా కోర్టులో మంత్రి రవీందర్రావు, ఎస్.భిక్షమయ్య, పానుగంటి అరుణ్కుమార్, మాకపాటి నాగార్జునరావు, కె.యాదగిరి, జెటటి మనీశ్ రావు, సుంకిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సికింద్రాబాద్ కోర్టులో ఆర్.సుధాకర్, పటాన్చెరు, రామచంద్రాపురం కోర్టులో ఆల్ల కొమురయ్యను నియమిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీరు తమ పదవుల్లో మూడేండ్ల పాటు కొనసాగుతారు.
సీఎంకు ధన్యవాదాలు: బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర
ఈ నియామకంలో ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించిందని బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. నియామక ప్రక్రియలో కీలక పాత్ర వహించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు, విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, శాసనభ్యుడు కాలేరు వెంకటేశ్, రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా నియామకమైన సభ్యులకు న్యాయవాదులు కొంతం గోవర్ధన్రెడ్డి, జక్కుల లక్ష్మణ్ అభినందనలు తెలియజేశారు.