వ్యవసాయ యూనివర్సిటీ : రాజేంద్ర నగర్లోని నార్మ్ పీజీడీఎమ్ అగ్రీబిజినెస్ రెండేళ్ల కోర్స్ కు దరఖాస్తులు కోరుతుంది. అర్హత గలవారు ఫిబ్రవరి 28 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నార్మ్ డైరెక్టర్ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన ద్వారా సూచించారు.
నేషనల్ అకాడమి ఆఫ్ అగ్రికల్చలర్ రీసెర్చ్ మేనేజిమెంట్ 14వ బ్యాచ్ పీజీడీఎమ్ ఇన్ అగ్రిబిజినెస్ ( 2022- 24 ) దరఖాస్తులు ఆన్లైన్లో చేయవచ్చన్నారు. జనరల్ , బిసీ విద్యార్థులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ రూ.750 చెల్లించాల్సి ఉంది. మొత్తం 66 పోస్టులు ఖాళీ ఉన్నాయని తెలిపారు.
మరింత సమాచారం కొరకు https;//naarm.org.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు.