మణికొండ, ఆగస్టు 31: కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను నార్సింగి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా గురువారం పట్టుకున్నారు. వారివద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి ప్రధాన చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిపై పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు. స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థికి చిన్న చిన్న ప్యాకెట్లు విక్రయిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.
అనంతరం వారిని పోలీసుస్టేషన్కు తరలించి విచారించగా.. విశాఖపట్నం అరకు నుంచి గంజాయి తీసుకొచ్చి.. చిన్నచిన్న ప్యాకెట్లలో గంజాయి నింపి.. ఎవరు ఎంత మోతాదు అడిగితే అంతే విక్రయిస్తామంటూ విచారణలో వెల్లడించారు. నిందితులను అస్సోం రాష్ర్టానికి చెందిన పర్బాల్గోగై(19), రతన్ బర్వా (26), భరత్ గొగై(19), బిట్టు గొగై (19)గా గుర్తించారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డులు పనిచేస్తూ.. గంజాయి దందా చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వీరివద్ద నుంచి పది కిలోల గంజాయి, ఆరు మొబైల్ ఫోన్లు, పాలిథిన్ కవర్, పిన్నులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.