కాచిగూడ,ఆగస్టు 19 : అనారోగ్యంతో ఫుట్పాత్పై గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని మహిళ(45)కాచిగూడ రైల్వేస్టేషన్ కాఫీడే ఫుట్పాత్పై అనారోగ్యంతో గురువారం మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు.
మృతురాలి ఒంటిపై తెలుపు రంగు నైటిపై నీలి రంగు పూలు ధరించి, ఎత్తు 5.2 ఉన్నట్లు తెలిపారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిరాలి వివరాల కోసం 7382296573లో సంప్రదించాలని అడ్మిన్ ఎస్సై కోరారు.