హైదరాబాద్ : హకీంపేట్(Hakeempet) ఎయిర్ ఫోర్స్ స్టేషన్( Indian Air Force )లో విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే..ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఎయిర్ క్రాఫ్ట్ క్లీనింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఎజెక్షన్ సీట్(Ejection seat) పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఉత్తర్ ప్రదేశ్కు చెందిన హరివీర్ చౌదరి అనే ఆఫీసర్ తల రెండు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. పోస్టు మార్టం అనంతరం స్పెషల్ ఫ్లైట్ మధురకు తరలించనున్నారు. హరివీర్ చౌదరి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.