కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
వహర్నగర్, బోడుప్పల్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
అంబేద్కర్కు నివాళులర్పించిన ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు
బోడుప్పల్, ఏప్రిల్ 14: అట్టడుగువర్గాల అభ్యున్నతికి, కులరహిత సమాజ నిర్మాణానికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బోడుప్పల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పిట్టలబస్తీలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కలలుగన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో దళితుల కోసం గురుకులాలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఆర్థికంగా, సామాజికంగా సమూల మార్పులు సృష్టిస్తున్నదని మంత్రి మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు రవిగౌడ్, ఉప్పరివిజయ్, కీర్తన్రెడ్డి, మనోహర్రెడ్డి, మోతె రాజు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా లక్ష్మీప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో వీరారెడ్డి ప్రధాన కూడలిలో శీతలపానియాలు పంపిణీ చేశారు.
దళితబంధుతో కొత్త వెలుగులు : మంత్రి మల్లారెడ్డి
జవహర్నగర్ : దళితబంధు పథకంతో సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం కార్పొరేషన్లోని 17వ డివిజన్ కార్పొరేటర్ చిత్రసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈస్ట్ నందమూరినగర్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి, మేయర్ కావ్య ఆవిష్కరించారు. కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, శాంతి కోటేశ్ గౌడ్, లావణ్యసతీశ్ గౌడ్, సతీశ్కుమార్, లలితాయాదవ్, ఆశాకుమారి,వేణు, లక్ష్మీకృష్ణగౌడ్, రాజ్కుమార్, రాంచందర్, నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి..
కీసర : మండల పరిధిలోని తిమ్మాయిపల్లిలో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిర, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల టీఆర్ఎస్ నాయకుడు జె.సుధాకర్ రెడ్డి , తిమ్మాయిపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కిరణ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్కు ఘన నివాళి
మేడ్చల్ జోన్ బృందం : అంబేద్కర్ జయంతిని మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్, శామీర్పేట, మూడుచింతలపల్లి, ఘట్కేసర్, కీసర మండలాల్లోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఘట్కేసర్, ప్రతాపసింగారంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి , టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మలిపెద్ది సుధీర్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.