ఓ వెబ్సైట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అందులోని గిఫ్ట్ ఓచర్లను చోరీ చేశారు. సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. బర్కత్పురలోని జాబ్ టెక్నాలజీస్ అనే సంస్థ అమెజాన్తో ఒప్పందం కుదుర్చుకొని, అమెజాన్ గిఫ్ట్ ఓచర్లను రీసేల్ చేస్తుంటారు. ఈ క్రమంలో తమ సైట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ. 4.18 లక్షల విలువైన 470 గిఫ్ట్ ఓచర్లను చోరీ చేశారంటూ ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ముంబై థానేలోని వికాస్ వినోద్ ఉపాధ్యాయ పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.