మియాపూర్ , జూన్ 16 : స్వచ్ఛ ఆటోకు చెత్త ఇవ్వకపోగా రహదారిపై వేస్తున్న ఓ వ్యక్తిని అల్విన్ కాలనీ సర్కిల్ డీసీ చాముండేశ్వరి జరిమానా విధించారు. మంగళవారం ఎల్లమ్మబండ దత్తాత్రేయ నగర్లో ఉదయం మహేశ్ తన బైక్పై గృహ వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లో నింపి తీసుకెళుతుండగా అదే ప్రాంతంలో పారిశుధ్య తనిఖీలో ఉన్న డీసీ చాముండేశ్వరి ఆ వాహనాన్ని వెంబడించారు.
రహదారి పక్కనే వ్యర్థాల కవర్ను విసిరేసి వెళుతుండగా కారులో కిలో మీటరు మేర ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి రూ. 500 జరిమానా విధించారు.