కవాడిగూడ, మే 7 : స్వాతంత్య్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం ట్యాంక్బండ్పై ఉన్న అల్లూరి విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజుతో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల కోసం ఎనలేని పోరాటం చేశారని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి పాత్ర గొప్పదన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు అభిమానులు, దేశ భక్తులు పాల్గొన్నారు.