కందుకూరు : గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కొత్తగూడ సర్పంచ్ సాధ మల్లారెడ్డి గురువారం మంత్రిని కలిసి గ్రామంతో పాటు క్రాస్ రోడ్డులోని సీతారామ శాస్త్రీ నగర్లో సీసీ రోడ్లు , అండర్ డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన అనంతరం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. కొత్తగూడ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, సర్పంచ్ సాధ మల్లారెడ్డి, వార్డు మెంబరు మరి శేఖర్రెడ్డి, కో ఆప్చన్ మెంబరు బాల్రెడ్డి, నాయకులు తాల్ల బాలేష్ ముదిరాజ్, బండారు క్రిష్ణ, క్రిష్ణాగౌడ్లు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన వివిధ కులాల నాయకులు
మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం కేటాయించాలని వివిధ కులాల సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందించి అన్ని కూలాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలం కేటాయిస్తానని చెప్పారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఆనేగౌని దామోదర్గౌడ్, పాండుగౌడ్, సౌడపు శేఖర్గౌడ్, వెంకటేష్గౌడ్. సిద్దేశ్వర్గౌడ్, మక్తాల వెంకటేష్గౌడ్, రాజుగౌడ్, తిరుపతిగౌడ్, రూప్ చందర్, పాల్గొన్నారు.