రవీంద్రభారతి, అక్టోబర్ 19: అక్కినేని నాగేశ్వరరావు సామాన్య కుటుంబంలో జన్మించి తెలుగు సినిమా రంగంలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న మహనీయుడని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వంశీ-శుభోదయం సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో డా.అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి సందర్భంగా ప్రముఖ సినీ,టీవీ, రంగస్థల నటుడు లోహిత్కుమార్కు అక్కినేని కళారత్న స్వర్ణకంకణ పురస్కారం – 2022 బహుకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కె.వి రమణాచారి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి లోహిత్కుమార్కు అక్కినేని కళారత్న పురస్కారాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో శుభోదయ గ్రూప్ సీఎండీ లయన్ డా. శ్రీలక్ష్మీప్రసాద్ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల డి.సురేశ్కుమార్, ది హాంగ్కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి, వీఆర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గణేశ్ పట్టాభిషేకం వారిచే నిర్వహించిన తెలుగు పాటలకు పట్టాభిషేకం సినీ సుస్వరాల కార్యక్రమం అందరిని ఆకట్టుకున్నది.