హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. నిజామాబాద్, నిర్మల్లో మాట్లాడిన హేట్ స్పీచ్ కేసులను నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఓవైసీ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపలేదని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్పై నమోదైన రెండు కేసులను కొట్టివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కేసు కొట్టివేసినంతా మాత్రాన సంబురాలు చేసుకోవద్దని కోర్టు సూచించింది. దేశ సార్వభౌమత్వం దృష్ట్యా భవిష్యత్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఓవైసీకి కోర్టు సూచన చేసింది.
2012 డిసెంబర్లో నిజామాబాద్, నిర్మల్లో పర్యటించిన అక్బరుద్దీన్.. హిందువులను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు కేసు నమోదైంది. అదే ఏడాది అక్బరుద్దీన్పై నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2013, జనవరి 8న ఓవైసీని నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. 2013, ఫిబ్రవరి 16న జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు.. దాదాపు 30 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ వాదనలు తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించింది.