IIT H | సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేథ పరిజ్ఞానంతో మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు, సాఫ్ట్ట్వేర్లను రూపొందించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కు అమెరికాకు చెందిన క్వాల్ కామ్ సంస్థ 1.86 లక్షల డాలర్లను గ్రాంట్గా అందజేయనున్నది.
ఈ మేరకు మూడేండ్ల పాటు పరిశోధనలు కొనసాగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ప్రయోగశాలను క్వాల్కామ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లీండర్ వాస్ డోర్న్ ప్రారంభించినట్లు ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ తెలిపారు.