హిమాయత్నగర్ : కేంద్ర పభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పలువురు వక్తలు స్పష్టం చేశారు. భారత్ బంద్లో భాగంగా శుక్రవారం నారాయణగూడలో వామపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకటరామయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు కాలం చెల్లిందని, ప్రజస్వామ్యాన్ని గౌర వించాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు పద్మ, సాగర్, రంగయ్య, కాంతయ్య, వెంకట్ రాములు, సాధినేని వెంకటేశ్వర రావు, మురహరి, నర్సింహారెడ్డి, పోటు రంగారావు, ప్రసాద్, హన్మేష్, ఎస్.ఎల్ పద్మ, అనిల్కుమార్, కమతం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.