చార్మినార్ : వన్యప్రాణుల మనుగడను సమాజానికి చాటిచెప్పేలా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పలువురు పెయింటింగ్ ఆర్టిస్టులు తమ పెయిం టింగ్లతో ప్రదర్శన నిర్వహించి వన్యప్రాణుల సంరక్షణ కోసం చక్కటి సందేశాన్ని చాటిచెప్పారని జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తెలిపారు.
జనవరి మాసంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో డైరెక్టర్ లక్ష్మీ సహకారంతో కూర్మ శిల్పం పేరుతో 21,22 తేదిల్లో చిత్రాల ప్రదర్శన నిర్వహించారని తెలిపారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఎగ్జిబిషన్కు లభించిన స్పందనతోపాటు జంతు సంరక్షణపై ప్రజల్లోనూ అవగాహన కలింగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
వన్యప్రాణి సంరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలనే ప్రేరణ కల్పిస్తూ పర్యావరణ హితాన్నిచాటిచెప్పడానికి ప్రయత్నించామని స్టేట్ ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మీ తెలిపారు.ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఆర్టిస్టులతో కలిసి వన్యప్రాణి సంరక్షణ కోసం ముందుకు వచ్చామని తెలిపారు. ఆర్టిస్టుల భాగస్వామ్యంతో జూలోని 9 తాబేళ్లను సంవత్సరం పాటు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చామని ఆమె తెలిపారు.
జూ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమంలో వన్యప్రాణి సంరక్షణ కోసం పాటుపడుతూ ఎగ్జిబిషన్లో పాల్గొన్న చైతల జగదీష్, అలయ్ లక్ష్మన్, అర్పితారెడ్డి, బుషయ్య, సచిన్ జల్టేర్, అమృష్ జూ పార్క్ అసిస్టెంట్ క్యూరేటన్ నాగమణితోపాటు జూ ప్రజా సంబంధాల అధికారి హనీఫుల్లా తదతరులు పాల్గొన్నారు.