హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా నటి షెర్లీ సెటియా గురువారం జూబ్లీహిల్స్ పార్క్లో మొక్కలు నాటారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ఎంపీ సంతోష్కుమార్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
విక్టరీ వెంకటేశ్, శిల్పాశెట్టి, రాజ్కుమార్రావు, అభిమన్యులకు గ్రీన్ చాలెంజ్ విసిరి మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని షెర్లీ సెటియాకు బహూకరించారు.