నగరంలో శుక్రవారం నటి ప్రగ్యా నయన్ సందడి చేశారు. హైటెక్స్లో 22 నుంచి ‘కిడ్స్ ఫెయిర్’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణకు హాజరైన ప్రగ్యా.. ఇలా ఫొటోకు పోజులిచ్చారు.
మాదాపూర్, డిసెంబర్ 15: మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 22 నుంచి 24 వరకు కిడ్స్ ఫెయిర్ 2023 నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైటెక్స్ డిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్ శర్వాణి ఎవెన్యు వెంచర్స్ మనస్విని బండి, వైస్ ప్రెసిడెంట్ స్మిత చౌదరి కంకణాల, కంటినెంటల్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జీవని గద్దె, ఫ్యూచరిస్ట్ ఎడ్యు ఇనిస్టిట్యూట్ ఇనిషియేటివ్స్ డైరెక్టర్ అఖిల భూపతి రాజు, లైఫ్ స్పాన్ ప్రై.లిమిటెడ్ సీఎండీ నరేంద్ర రామ్, జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్, హైదరాబాద్ రన్నర్స్ మధుసూదన్తో పాటు నటీ ప్రగ్యా నయన్లతో కలిసి హాజరయ్యారు.
మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 100కు పైగా స్టాళ్లు అందుబాటులో ఉండగా డెకాథ్లాన్, జాకీ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్, న్యారా ఉత్పత్తులు, గేమ్ పాయింట్, మెయిన్ స్ట్రీట్ కిడ్స్, కిము రోబోటిక్స్, లిటిల్ ఓటర్స్, మ్యాప్, మ్యాజిక్స్ బాక్స్, పలు క్రీడలతో పాటు అక్షయ కల్ప ఆర్గానిక్, ఇండిక్ రూట్స్ లైఫ్ైస్టెల్, మాంచెస్టర్, గ్లోబల్ స్కూల్ ఎగ్జిబిటర్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.