బంజారాహిల్స్, జూన్ 16: జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఆరుగురు నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన పొటెన్సీ టెస్టు నివేదిక పోలీసులకు అందినట్లు తెలుస్తున్నది.
నిందితులందరికీ లైంగిక సామర్థ్యం ఉన్నట్లు నివేదికలో వైద్యులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.