హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బైక్ రైడర్లు రెచ్చిపోయారు. అతి వేగంగా దూసుకెళ్లి డివైడర్ను ఢీకొట్టాడు ఓ బైకర్. హైదరాబాద్కు చెందిన ఓ పది మంది యువకులు తమ స్పోర్ట్స్ బైక్లపై శంషాబాద్ వైపు శనివారం ఉదయం బయల్దేరారు. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బెంగళూరు హైవే ఫ్లై ఓవర్పై బైక్ రైడర్లు స్పీడ్గా దూసుకెళ్లారు.
ఈ క్రమంలో మైఖేల్ అనే యువకుడి బైక్.. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, మైఖేల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బైక్ రైడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.