హైదరాబాద్ : పెట్రోల్ కోసం బైక్పై వచ్చిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పెట్రోల్కు సంబంధించిన నగదును యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తానని యువకుడు చెప్పాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ కాకపోవడంతో బంక్ నిర్వాహకులు నగదు అడిగారు. దీంతో బంక్ నిర్వాహకులకు, యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. యువకుడు తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీసి భయాందోళనలకు గురి చేశాడు. క్యాషియర్పై దాడి చేశాడు.
అనంతరం మరో ఇద్దరికి ఫోన్ చేసి బంక్ వద్దకు పిలిచాడు. ఇక ముగ్గురు యువకులు కలిసి బంక్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తుపాకీ కలిగి ఉన్న ఇఫ్తికర్ను బంక్ సిబ్బంది పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీ అయ్యారు. బంక్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు బహదూర్పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.