తెలుగుయూనివర్సిటీ : గుర్తు తెలియని ఓ వ్యక్తి పట్టాల వెంట నడుస్తుండగా రైలు తగిలి మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…హాఫీజ్పేట-చందానగర్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం సుమారు 25సంవత్సరాల యువకుడు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు రాకను గమనించక పోవడంతో రైలు ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే తీవ్రగాయాలతో మృతి చెందినట్లు తెలిపారు.
ప్రమాదవశాత్తు జరిగినట్లుగా భావిస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని ఉస్మానియా దవఖాన మార్చురీలో భధ్రపరిచి కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుని శరీరంపై బ్లూ ఎల్లో రంగు పుల్ షర్టు, బ్లాక్ కలర్ నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. వివరాలకు 040-23202238, 9848349544 నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.