హైదరాబాద్ : మద్యానికి బానిసై(Alcoholism) ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం(Committed suicide) చేసి చికిత్స పొందుతూ మరణించిన సంఘటన అల్వాల్(Alwal) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచ్చ బొల్లారం సాయి రెసిడెన్సికి చెందిన రాణా ప్రతాప్ సింగ్(33) సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై ఉద్యోగానికి వెళ్లడం మానేశాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. వారం కిందట వెసవి సెలవులుకు భార్య, పిల్లలు నాందేడ్కు వెళ్లారు.
మద్యానికి బానిసైన రాణా ప్రతాప్ సింగ్ మానసిక ఒత్తిడితో మంగళవారం తన ప్లాట్లో మద్యం సేవించి మత్తులో నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగాడు. తర్వాత అదే అపార్టుమెంట్లో ఉంటున్న బంధువుల వద్దకు వెళ్లి వాంతులు, వీరోచనాలు చేసుకున్నాడు. బంధువులు ఏమైయిందని ప్రశ్నించడంతో నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగానని తెలిపాడు. వెంటనే వారు చికిత్స కోసం సికింద్రాబాద్లోని గాంధీ దవఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. తండ్రి సమీర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.