Hyderabad | మాదాపూర్లోని హోటల్లో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పుదుచ్చేరికి చెందిన ప్రియ, చెన్నై వాసి శ్రీహరి నిన్న సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. మాదాపూర్ చంద్రనాయక్ తండా వద్ద ఉన్న ఓ హోటల్లో వారిద్దరూ దిగారు. ప్రియ, శ్రీహరి కలిసి నిన్న రాత్రి హోటల్లోనే మద్యం సేవించారు. అనంతరం భోజనం చేశారు.
ఫుడ్ పాయిజన్తో శ్రీహరి బుధవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లాడు. కోలుకున్న శ్రీహరి ఆస్పత్రి నుంచి హోటల్ గదికి వచ్చి చూడగా, ప్రియ కుర్చీలోనే కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రియ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.