గోల్నాక : తమ దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఆదివారం గోల్నాక డివిజన్ ఖాద్రీబాగ్, జైస్వాల్గార్డెన్ కాలనీ వాసులు గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను కలిసి తమ సమస్యలు వివరిస్తూ వినతి పత్రం అందజేశారు.
ముఖ్యంగా బస్తీలో గత కొంత కాలంగా కమ్యూనిటీ హాల్ సమస్య పెండింగ్లో ఉందని దీంతో పాటు పలు స్థానిక సమస్యలను పరిష్కరించాలని బస్తీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు .వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
అదే విధంగా సోమవారం రెండు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఖాద్రీబాగ్, జైస్వాల్గార్డెన్కు చెందిన బస్తీవాసులు శ్రీనివాసరెడ్డి, రవీందర్గౌడ్, సత్యనారాయణ, శ్రీధర్గౌడ్, మహేష్కుమార్, కె.శ్రీనివాస్, పి.శ్రీనివాస్, శంకర్, సుధాకర్, వంశీకృష్ణ, కుమార్గౌడ్, శివశంకర్, బస్వరాజు తదితరులు ఉన్నారు.