నేరేడ్మెట్, డిసెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత తాగునీటి పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం వినాయక్నగర్ డివిజన్, శివనగర్లో మంచినీటి పైపులైన్ల పనులను స్థానిక కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో భూగర్భ, మంచినీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింద న్నారు. ప్రజల కోసం పనిచేసే సీఎం దొరకడం మన అదృష్టమన్నారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గం అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సైనిక్పురి వాటర్ వర్క్స్ జీఎం సునీల్ కుమార్, డీజీఎం భాస్కర్, కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, జితేంద్రనాథ్, మాజీ కా ర్పొరేటర్ జగదీశ్గౌడ్, మల్కాజిగిరి నియోజకవర్గం ఇన్చార్జి బద్దం పరశురాంరెడ్డి, పిట్ల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్కుమార్, తులసీ సురేశ్, బాల రాజుయాదవ్, చంద్రకాంత్, రజిత, లతా, ఫరీద్, ప్ర భాకర్రెడ్డి, యాదగిరి, ఓం ప్రకాశ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.