Road Accident | శంషాబాద్ రూరల్, మే 25 : హైదరాబాద్ – బెంగుళూరు జాతీయ రహదారిలో ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందగా మరో ఇద్దరు కానిస్టేబుల్స్కు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం ఆర్థరాత్రి శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిలో శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామం వద్ద ఎంహెచ్ 04జేయు 8209 నంబర్గల లారీ అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లిందని 100 డయల్కు కాల్ రావడంతో పెట్రోల్ మొబైల్ 1 సిబ్బంది డి విజయ్కుమార్(హెచ్సీ-3653), డి చెన్నయ్య(హెచ్సీ-1180) కాల్తో స్పందించి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆదే సమయంలో హైవే ట్రాఫిక్ మొబైల్ సిబ్బంది యాదయ్య(ఏఆర్హెచ్సీ-1040), డ్రైవర్ శ్రీనివాస్(హెచ్జీ-1969) ఇరువురు చేరుకున్నారు. ఆదే సమయంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేయడానికి యత్నిస్తుండగా రాత్రి 10.45 గంటల సమయంలో షాద్నగర్ వైపు నుంచి శంషాబాద్ వైపు వచ్చిన కేఏ 56 6430 నంబర్గల లారీని డ్రైవర్ అతివేగంగా నడిపిస్తూ పోలీస్ సిబ్బందిపైకి దూసుకెళ్లాడు. శంషాబాద్ పోలీస్సేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ డి విజయ్కుమార్(హెచ్సీ- 3653) అక్కడిక్కడే మృతి చెందగా మిగిత వారికి తీవ్ర గాయలైయ్యాయి. విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మదాపూర్లోని యశోద దవాఖానకు తరలించారు. మృతి చెందిన కానిస్టేబుల్ను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ రమేష్ కుంబ్లేను ఆరెస్టుచేసి స్టేషన్కు తరలించిన్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కానిస్టేబుల్కు అత్యక్రియలు పూర్తి
విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయ్కుమార్(40) అతడి స్వగ్రామం షాబాద్ మండలంలోని కుర్వగూడలో అధికార లాంచనాలతో అత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో శంషాబాద్ జోన్ డీసీపీ రజేష్, ఏసీపీ శ్రీకాంత్గౌడ్, సీఐలు నరేందర్రెడ్డి, బాలరాజుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. విజయ్కుమార్ 2006 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్గా పోలీసులు తెలిపారు.