Hyderabad | హైదరాబాద్ : ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించాడు. ఆ మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. రెండు గంటల పాటు విద్యుత్ స్తంభంపైనే ఉన్నాడు. ఈ ఘటన మీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, యువకుడిని కిందకు దించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటల తర్వాత ఆ యువకుడిని పోలీసులు కిందకు దించారు. మందుబాబు కిందకు దించడానికి పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.