హైదరాబాద్ : మైనర్పై లైంగిక దాడి పాల్పడిన నిందితుడికి 30 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబానికి రూ. 40 వేలు పరిహారం సైతం చెల్లించాలని ఆదేశించింది. కేసు పూర్వాపరాలివి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకరాంగేట్లో మైనర్ బాలికపై హోంగార్డు మల్లికార్జున్ (35) లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ కేసులో ఫిబ్రవరి 19న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక గర్భం దాల్చడంతో మెడికల్ రిపోర్ట్ నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వరకు అన్ని ఆధారాలను పక్కాగా సేకరించారు. ఇవాళ కేసు విచారణలో నాంపల్లి మెట్రోపాలిటన్ సెస్షెన్స్ జడ్జి కోర్టు అదనపు న్యాయమూర్తి సునీత కుంచాల అన్ని ఆధారాలను పరిశీలించి నిందితుడికి శిక్షను ఖరారు చేశారు.