హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం డీఆర్ఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు ప్రయాణికుడి నుంచి 3 కిలోల 140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 1.65 కోట్ల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.