హైదరాబాద్: హైదరాబాద్లోని టప్పాచబుత్రాలో (Tappachabutra) అర్ధరాత్రి కాల్పులు (Firing) కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టప్పాచబుత్రాలో ఆకాశ్ సింగ్ (Akash Singh) అనే యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు (Osmania Hospital) తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. పాతకక్షలే కాల్పులకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.