సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ మహానగరంలోని కీలకమైన రద్దీ ప్రాంతాల్లో రోడ్లు దాటాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి. ప్రధానంగా బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్, మెట్రో అందుబాటులోకి వచ్చాక మెట్రోస్టేషన్ నుంచి బస్టాండ్కు వెళ్లాంటే పాదచారులకు రక్షణ కరువవుతున్నది. కీలకమైన జంక్షన్లలో అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని రోడ్డు దాటాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. ముఖ్యంగా ప్రతి ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా వారే మృతి చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన జంక్షన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్నింటిని అందుబాటులోకి తీసుకురాగా.. మరికొన్నింటి పనులను విడుతల వారీగా చేపడుతూ వస్తున్నది. 21 చోట్ల రూ.127.35 కోట్లతో చేపట్టిన ఎఫ్ఓబీ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి.
చురుగ్గా పనులు..