ఉప్పల్/చర్లపల్లి, డిసెంబర్ 2 : ఉప్పల్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఈమేరకు మేడ్చల్ జిల్లాలోని కీసర బోగారం హోలీమేరి ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 418 పోలిం గ్ కేంద్రాలు ఉండగా, 27,2870 ఓట్లు పోలైనాయి. అయితే కౌంటింగ్ కోసం 20 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 21 రౌండ్లు లెక్కింపు జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఆదివారం మధ్యాహ్నంలోగా పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది.
ఉప్పల్ నియోజకవర్గపరిధిలో వివిధ పార్టీలకు చెంది న అభ్యర్థులు ఎవరికివారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలనే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో 51.35శాతం ఓటింగ్ నమోదు కాగా ఉప్పల్, చిలుకానగర్, రామంతాపూర్, నాచారం, కాప్రా, చర్లపల్లి, ఏఎస్రావునగర్, హెచ్బీకాలనీ మీర్పేట, మల్లాపూర్, నాచారం డివిజన్లలో గత నెల రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం విధితమే.
అయితే.. నియోజకవర్గ పరిధిలో పోటీచేసిన అభ్యర్థులు తమ గెలుపుపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేయడంతో.. నేడు తేలబోయే ఫలితాల కోసం సమాయత్తమవుతున్నారు. నియోజకవర్గ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదుకావడం తో పలు డివిజన్లలో వివిధ పార్టీల నాయకులు, స్థానికులు బూత్ల వారీగా పోలైన ఓట్లను పరిశీలిస్తూ గెలుపుపై బేరిజూ వేసుకుంటున్నారు. గతంలో నియోజకవర్గంలో మొదటిసారిగా 2009లో ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2014లో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు.
అదేవిధంగా 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మె జారిటీతో గెలుపొందినప్పటి నుంచి నియోజకవర్గంలో పట్టు సాధించింది. నేడు నిర్వహించే ఉప్పల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో అసెంబ్లీకి పోటీచేసిన అభ్యర్థుల్లో విజయం ఎవరిని వరిస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొన గా… ఆయా పార్టీలకు చెందిన నాయకులు గెలుపుపై ధీ మా వ్యక్తం చేస్తూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపై చర్చికుంటూ.. పెద్ద స్థాయిలో బెట్టింగ్లకు పాల్పడటంతో పాటు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.