హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మద్యం, నగదు సరఫరాపై దృష్టి సారించారు. కాగా, నగరంలోని దోమలగూడలోని ఇందిరా పార్క్ వద్ద హనాల తనిఖీ చేపట్టారు. ద్విచక్రవాహనంలో తరలిస్తున్న రూ.15 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.