హైదరాబాద్ : దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో పటాకులు కాల్చుతూ 24 మంది గాయపడ్డారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 12 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురిని ఇతర ఆస్పత్రులకు సిఫారసు చేసినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. బాధితుల్లో చిన్న పిల్లలే అధికంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.