మలక్పేట, డిసెంబర్ 11 : భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, మాజీ గవర్నర్ రోషయ్యకు మలక్పేట మార్కెట్లో తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఉల్లి, మిర్చి, చింతపండు వ్యాపారుల సంఘాల నాయకులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలు నివాళులర్పించారు. శనివారం మలక్పేట మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన సంతాప సభలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, రోశయ్య చిత్రపటాలకు పూలమాల వేశారు. రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవర రాజేశ్వర్ మాట్లాడుతూ.. త్రివిధ దళాలకు సైన్యాధ్యక్షుడిగా సేవలందించి చివరకు దేశంకోసం అసువులు బాసిన బిపిన్ రావత్ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సర్జికల్ ్రైస్టెక్తో పాక్కు చుక్కలు చూపించిన సేనాధిపతి అని అన్నారు. బిపిన్ రావత్ మరణంతో దేశం గొప్ప సైన్యాధ్యక్షుడిని కోల్పోయిందన్నారు. బిపిన్ రావత్ మరణాన్ని యావత్ దేశం జీర్ణించుకోలేకపోతుందన్నారు. అదేవిధంగా రాజీకీయాల్లో పదవులకు వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు దివంగత మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అని రాజేశ్వర్ కొనియాడారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా గవర్నర్గా రాజకీయాలకతీతంగా పనిచేసి ప్రజలు మెచ్చిన నాయకుడని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ ఉపాధ్యక్షుడు చేగూరి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బట్కిరి వివేకానంద్, కోశాధికారి దేవత అశోక్, వంజరి వినోద్కుమార్, దుగ్గు విజయ్కుమార్, కార్యదర్శులు, సభ్యులు, ట్రేడర్స్, మిర్చి, ఉల్లిగడ్డ ఇన్పోర్ట్, ఎక్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు, చింతపండు కమీషన్ ఏజెంట్లు, మార్కెట్ అధికారులు గ్రేడ్-3 కార్యదర్శి రవీందర్రెడ్డి, వ్యాపారులు, హమాలీలు పాల్గొన్నారు.