-ఉద్రిక్తల మధ్య కొనసాగిన అంతిమ యాత్ర
-భారీ సంఖ్యలో పాల్గొన్న కులనిర్మూలన సంఘం నాయకులు
-నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు
సుల్తాన్బజార్ : పరువు హత్యకు గురైన బేగంబజార్ కోల్సావాడికి చెందిన వ్యాపారి నీరజ్ పన్వర్ (22)మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో ఫోరెన్సిక్ వైద్యురాలు ఝాన్పీ ఆధ్వర్యంలో శనివారం పో స్టు మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని బేగంబజార్ కోల్సావాడిలో మృతుడి నివాసానికి తరలించారు.
స్థానికులు, వ్యాపారస్థులు,వివిధ పార్టీల రాజకీయ నాయకులు,వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసులతో పాటు అదనపు బలగాలను మృతుని ఇంటివద్ద మొహరించారు.
మృతుడు యువకుడు కావడం, అకాలమరణం చెందడంతో అతని అంతిమ యాత్ర కాలి నడకనే నిర్వహిస్తామని కుల సంఘం నాయకులు కోరడంతో పోలీసులు అంగీకరించారు.అనంతరం కోల్సావాడి నుంచి ఇమ్లిబన్ స్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది.
అంతిమయాత్రలో గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద కిశోర్ వ్యాస్, ఆనంద్ కుమార్ గౌడ్, వ్యాపార సంఘాల ప్రతినిధులు మున్నాలాల్ భాటి, జీవన్ లాల్ భాటి, రమేష్ సోలంకి, బీఎంఎస్ ఉస్మానియా యూనిట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లపల్లి అనిల్ కుమార్, సీఐటీయూ గోషా మహల్ నాయ కులు పి నాగేశ్వర్ తదితరులు పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు. నిందితులను కఠినంగా శిక్షించాలం టూ వివిధ సంఘాలు నాయకులు,భాధితుల కుటుంబీకులు ముక్త కంఠంతో నినదించారు.