కాలనీల్లో పర్యటించిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు
పారిశుధ్యం లోపించకుండా చర్యలు
నాలా పనులు త్వరగా పూర్తి చేయాలి
బడంగ్పేట, జూన్ 18 : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26, 28, 30, 31 డివిజన్లలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాలను స్థానిక కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, రామిడి కవితా రాంరెడ్డి, బీమిడి స్వప్న జంగారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్తో కలిసి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పర్యటించి మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులతో మాట్లాడారు. కాలనీల అభివృద్ధికి సహకరించాలని కాలనీవాసులకు సూచించారు. వర్షాకాలంలో ఇబ్బంది కలుగకుండా లోతట్టు ప్రాంతాల్లో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మీర్పేట సర్వోదయ కాలనీలో మొక్కలు పంపిణీ చేస్తున్న మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి
మీర్పేటలో..
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్సీఐ రోడ్డులో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, కార్పొరేటర్లతో కలిసి కాలనీలో పర్యటించి మొక్కలు నాటారు. దీన్దయాళ్నగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. పూల మొక్కలను అందజేశారు. సర్వోదయ కాలనీలో ఉన్న నర్సరీలను పరిశీలించి పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత కాలనీవాసులు తీసుకోవాలన్నారు. కాలనీలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు , కాలనీ వాసులు ఉన్నారు.
పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం : జడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్రెడ్డి
మహేశ్వరం, జూన్ 18 : పల్లె ప్రగతి దేశానికే ఆదర్శమని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. శనివారం సుభాన్పూర్, దుబ్బచెర్ల గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను గ్రామ సర్పంచులు గుత్తి పద్మపాండు, స్లీవారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. సీఎం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. పల్లె ప్రగతిలో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలను శరవేగంగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తలను వేరు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె అధికారులకు సూచించారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు తెలంగాణ అందాలకు ఉట్టిపడే విధంగా సంరక్షిస్తున్నారని ఆమె సర్పంచ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఓం ప్రకాశ్, ఎంపీడీవో నర్సింహులు, ఎంపీవో రవీందర్రెడ్డి, ఏపీవో పరిమళ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జహంగీర్ పాషా, కోఆప్షన్ సభ్యులు బొల్లు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధి..
కందుకూరు, జూన్ 18 : గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి ఎంతో దోహదపడుతుందని ఎంపీపీ మంద జ్యోతి పాండు తెలిపారు. 5వ విడత పల్లె ప్రగతి ముంగింపు కార్యక్రమంలో శనివారం మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
పరిశుభ్రంగా కాలనీలు
పహాడీషరీఫ్, జూన్ 18 : కాలనీ, బస్తీలు పరిశుభ్రంగా మారుతున్నాయని 2వ వార్డు కౌన్సిలర్ జాఫర్ బామ్ అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 2లో శనివారం పట్టణ ప్రగతి నిర్వహించారు. పారిశుధ్యంపై కాలనీ, బస్తీవాసులకు అవగాహన కల్పించారు. కాలనీలను క్లీనింగ్ చేయించి బ్లీచింగ్ ఫౌడర్ చల్లించారు.
స్వచ్ఛతలో ప్రజలు భాగస్వాములు కావాలి
ఆర్కేపురం, జూన్ 18 : స్వచ్ఛతలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ పేర్కొన్నారు. శనివారం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఎన్నో ఏండ్లుగా ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్తను జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా జీహెచ్ఎంసీ సిబ్బంది ఎత్తివేశారు. ఈ కార్యక్రమంలో సిద్దగోని వెంకటేశ్గౌడ్, వల్లూరి రమేశ్, అల్లావుద్దిన్పటేల్, దివాకర్రావు, కాలనీ వాసులు కృష్ణ, అంజాద్, ఎల్లయ్య తదితరులు ఉన్నారు.