చిక్కడపల్లి, మార్చి 10: అశోక్నగర్ మీదుగు వెళ్లే 40 నంబర్ ఆర్టీసీ బస్సు సర్వీస్ను పునరుద్ధరించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతన రోడ్డు నిర్మాణ, ట్రాఫిక్ కారణంగా గత ఐదు నెలలుగా 40 నంబర్ ఆర్టీసీ బస్సు సర్వీస్ను రద్దు చేయడంతో అశోక్నగర్, చిక్కడపల్లి, అరుంధతి నగర్, గాంధీనగర్ తదితర చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వీస్ నిలిపివేయడంతో ప్రయాణికులు కష్టాలు ఎదుర్కొంవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా చిరు ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు అందుబాటులో లేక పోవడంతో ఆటోలు, ఇతర ప్రైవేట్ రవాణా వాహనాల ప్రయాణం భారంగా మారింది.
దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పలు కాలనీల ప్రజలు బస్సు సర్వీసులు లేక పోవడంతో ఎదుర్కొటున్న సమస్యలను ఎమ్మెల్యే ముఠాగోపాల్కు దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ వెంటనే స్పదించి ట్రాఫిక్ ఏసీపీ మురళీ కృష్ణ, ముషీరాబాద్ బస్డిపో మేనేజర్ కిషన్రావు అధికారులతో సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. ఇటీవలే పది రోజులు క్రితం తిరిగి 40 బస్సు సర్వీస్ను ప్రారంభించారు. ప్రతి 8 నిమిషాలకు ఒక బస్సు చొప్పున ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 32 బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికుల, లిద్యార్థుల, చిరుద్యోగులు కష్టాలు తీర్చడంలో ప్రతేక చొరవ చూపిన ఎమ్మెల్యేకు స్థానిక కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ… కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. అధికారులకు సమీక్ష సమావేశాలు నిర్వహించి తిరిగి 40 నంబర్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చాము. ప్రజలు, విద్యార్థులు, చిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.