బాలానగర్, ఏప్రిల్ 6 : కాలనీ కమిటీలు డివిజన్ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లిలోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసంలో ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ప్రభాకర్రెడ్డినగర్, సమతానగర్, శివశంకర్నగర్లలో నూతన బస్తీ కమిటీ సభ్యులను కార్పొరేటర్ సతీశ్గౌడ్ ఎమ్మెల్యేకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ కమిటీలు డివిజన్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేలా ముందుకు సాగాలని ఎమ్యెల్యే సూచించారు. ఆయా బస్తీలు, కాలనీల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే స్థానిక ప్రతినిధుల దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. తద్వారా ఆయా బస్తీల సమస్యలు పరిష్కారం కానున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఆ దిశగా కాలనీ, బస్తీ కమిటీలు దృష్టి సారించాలని సూచించారు.