ముషీరాబాద్, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ముషీరాబాద్ నియోజకవర్గంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎనిమిది కంటి వెలుగు సెంటర్లలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు, మందులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు, ప్రజా ప్రతినిధులు. నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఏర్పాటు చేసిన ఎనిమిది కంటి వెలుగు సెంటర్లలో గురువారం కంటి వైద్య పరీక్షలు మొదలయ్యాయి. నియోజకవర్గంలోని దోమలగూడ ఏవీ కాలేజ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి కంటి వెలుగు సెంటర్ను ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఇతర డివిజన్లలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లు కంటి వెలుగు సెంటర్లను ప్రారంభించారు. ముషీరాబాద్ వాలీబాల్ గ్రౌండ్, అడిక్మెట్ కమ్యూనిటీహాల్లో కంటి వెలుగు సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కంటి పరీక్షలు చేస్తున్న తీరు, మందుల పంపిణీని పరిశీలించారు. కంటి పరీక్షలు చేసుకున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, బి.శ్రీనివాస్ రెడ్డి, సురేందర్, శ్యామ్సుందర్, మాధవ్, అనురాధ, నేత శ్రీనివాస్, రవియాదవ్, రాజు, నాగులు తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి,జనవరి19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత ఉచిత కంటి వెలుగు కేంద్రాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీహాల్లో గురువారం కంటి వెలుగు కేంద్రంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, వైద్యాధికారి అవంతి, డాక్టర్ కిరణ్, డీఎంసీ హరి కృష్ణ, ఏఎంఓహెచ్ మైత్రేయి, డీపీఓ సుధాకర్ రావు, డీఈ సన్నీ, పార్టీ గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్ కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్,ఎర్రం శ్రీనివాస్ గుప్తా, గుండు జగదీశ్ బాబు, మారిశెట్టి నర్సింగ్రావు, రవి శంకర్గుప్తా, పున్న సత్యనారాయణ, సీహెచ్ హన్మంతు, భాస్కర్, బత్తుల కిరణ్కుమార్, జీవై గిరి, పీఎస్ శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, దేవయ్య, గణేశ్ యూసీడీ అధికారులు మధు, ఎండీ ఉస్మాన్, మంజూల పాల్గొన్నారు.
రాంగనగర్ డివిజన్ బాగ్లిగంపల్లి నైబర్హుడ్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ప్రారంభించారు. బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, సీమాయత్నగర్ తహసీల్దార్ చంద్రకళ, డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మజ, డాక్టర్ వసంత్కుమార్, డాక్టర్ విజయ్కుమార్, హెల్త్ సూపర్వైజర్ రామలక్ష్మి, ఏడీఈ గీత, రాంనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శి దామోదర్రెడ్డి, నైబర్హుడ్ కాలనీ అధ్యక్షుడు సిరిగిరి కిరిణ్కుమార్, కిషన్ రావు, ఆర్.జయదేవ్, శివకుమార్ యాదవ్, కల్యాణ్ నాయక్, ముదిగొండ మురళీ, టెంపుల్ జనార్దన్, నాగభూషణం, కూరగాయల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
భోలక్పూర్లో కంటి వెలుగు కేంద్రం ప్రారంభం
కవాడిగూడ, జనవరి 19: దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదలకు కంటి చూపును ప్రసాదిస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం భోలక్పూర్లోని మదర్సా మధీనాతుల్ ఉల్మ్ హై స్కూల్లో కంటి వెలుగు కేంద్రాన్ని ఆయన ఎస్పీడీఓ డాక్టర్ పద్మజా, డాక్టర్ రాజశ్రీ, బైబిల్ హౌజ్ డాక్టర్ శృతిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. భోలక్పూర్లో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదల ఇబ్బందులు తొలగిస్తామని అన్నారు. అనంతరం కంటి వెలుగుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, బింగి నవీన్ కుమార్, శంకర్ గౌడ్, షరీపోద్దీన్, రహీం, వాహబ్, జబ్బార్, మున్వర్ చాంద్, షాంద్ పాషా, ఉప్పలయ్య, వెంకటయ్య, కృష్ణ, ఆర్. శ్రీనివాస్, గోవింద్ రాజ్, కళ్యాణ్, మహేశ్, మక్బూల్ పాల్గొన్నారు.