సనాతన ధర్మానికి, జ్యోతిష విద్య, సంస్కృత, వేద శాస్త్రాలకు ఆలవాలమైన గుడి వంశంలో కాశ్యపస గోత్రంలో గుడి నృసింహ సిద్ధాంతి – గోదావరమ్మ దంపతులకు జన్మించారు. జ్యోతిర్విద్యా విశారదులుగా 45 సం॥లు నిరాటంకంగా పంచాంగ రచన గావించిన పితృదేవులైన గుడి నృసింహ సిద్ధాంతి గారి వద్ద జ్యోతిశ్శాస్త్రం, ముహూర్త, సిద్ధాంత (గణిత), జాతక, వాస్తు భాగాలను క్షుణ్ణంగా, సంపూర్ణంగా అభ్యసించారు.
అదే సమయంలో సమాంతరంగా శతావధాని శ్రీమాన్ కృష్ణమాచార్యుల సహోదరులు, శ్రీ వేంకటేశ్వర చెంపూ ప్రబంధాది అనేక గ్రంథాలను రచించిన అష్టావధాని శ్రీమాన్ శిరిశినహల్ పెరుమాండ్లాచార్యుల దగ్గర సంస్కృతంలో పంచ కావ్యాలు నైషధాంతం శ్రద్ధాభక్తులతో అభ్యసించారు. స్మార్త, ఆగమ పండితులు నిత్య పూజా దురంధరులు పితామహులైన శ్రీ గుడి కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద పూజాది కార్యక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలను అభ్యసించారు.
నిర్మల్ డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి. (ఎం.పి.సి) పూర్తి చేసి తదనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (అప్లయిడ్ మేథమేటికల్ స్టాటిస్టిక్స్) పూర్తి చేశారు. 19 సం॥ల వయసులోనే పంచాంగ గణితాన్ని ప్రారంభించి మొదటి 2 సంవత్సరాలు పితృదేవుల పర్యవేక్షణ సహాయ సహకారాలతో పూర్తిచేసి తదనంతరం స్వయంగా 42 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా పంచాంగ రచన చేస్తూ సంప్రదించిన వారందరికీ జాతక, జ్యోతిశ్శాస్త్ర, ప్రశ్న, ముహూర్త, వాస్తు విషయ నిర్ణయం తెలియజేస్తూ అనేక మంది మన్ననలను పొందుతున్నారు.
గుడి ఉమామహేశ్వర శర్మ సిద్ధాంతి
తండ్రి పేరు : కీ.శే. గుడి నృసింహ సిద్ధాంతి,
బ్రహ్మపురి, నిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ
ప్రస్తుత నివాసం : ఫ్లాట్ నెం. 103-ఎ,
రెండవ అంతస్తు, పి.బి.ఆర్. ఎస్టేట్స్,
కూరగాయల మార్కెట్ దగ్గర,
నల్లకుంట, హైదరాబాద్ – 500044.
సెల్: 9885096295, 040-27651530.