యోగా, ప్రాణాయామం అల్జీమర్స్ ముప్పును అరికట్టడంలోసాయపడతాయని తేలింది. భారత్లో 65-70 ఏండ్ల వయసు వారిలో.. 5 నుంచి 6 శాతం మందిలో తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మన దేశంలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2030 నాటికి 76 లక్షలకు చేరనుంది. అల్జీమర్స్ను యోగా ద్వారా నియంత్రించే వీలుందని నిపుణులు చెబుతున్నారు.
‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నది. ధ్యానం, యోగా, ప్రాణాయామాలతో అల్జీమర్స్ రోగుల్లో జ్ఞాపకశక్తి పెరిగినట్లు వెల్లడైంది. వృక్షాసనం, పశ్చిమోత్థాసనం, వజ్రాసనం, ఉజ్జయి ప్రాణాయామాలు ఆ ప్రయత్నంలో ఉపకరిస్తాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు.