న్యూఢిల్లీ : ఆరంభంలోనే వ్యాధిని గుర్తించేందుకు సాయపడే కృత్రిమ మేథను (ఏఐ) ఉపయోగించని వైద్యులు నిరర్ధకమని ప్రముఖ సర్జన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ ద్వారా డాక్టర్లను రీప్లేస్ చేయలేమని, కానీ ఏఐని ఎలా వినియోగించాలో తెలియని డాక్టర్ స్ధానంలో ఈ టెక్నాలజీ వాడకం తెలిసిన మరో డాక్టర్ ముందుకొస్తారని ప్రముఖ అమెరికన్ సర్జన్, రచయిత, యూఎస్ఎయిడ్ గ్లోబల్ హెల్త్ చీఫ్ డాక్టర్ అతుల్ గవాండె పేర్కొన్నారు.
భారత్-అమెరికా గ్లోబల్ హెల్త్ పార్టనర్షిప్ బలోపేతం దిశగా భారత్ పర్యటనలో ఉన్న అతుల్ ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ముచ్చటించారు. ఏఐ వ్యవస్ధల వినియోగంతో వచ్చే ప్రయోజనాలు ఇప్పటికే మన కండ్ల ముందున్నాయని చెప్పారు. ఏఐ సిస్టమ్ ద్వారా వెంటనే చదవగలిగే ఛాతీ ఎక్స్-రే సిస్టమ్లు అభివృద్ధి చేయబడ్డాయని తెలిపారు.
దీంతో రోగి పరిస్ధితిని తక్షణమే ఆకళింపు చేసుకోవచ్చని చెప్పారు. ఫలితంగా రోగికి సత్వర చికిత్స అందుతుందని, ప్రజల ప్రాణాలు కాపాడటంలో ఇది ఉపకరిస్తుందని అన్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న టీబీ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చని గవాండె తెలిపారు.
Read More :
Radhika Sarathkumar | లోక్సభ ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్.. ఎక్కడ్నుంచంటే..?