లండన్ : ఊబకాయం, మద్యపానం కాకుండా మనం తీసుకునే నూనెలు కూడా షుగర్ లెవెల్స్పై ప్రభావం చూపుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్తో టైప్ 1, టైప్ టూ మధుమేహుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్లో గణనీయమైన మార్పులు వస్తాయని జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
రైస్ బ్రాన్ ఆయిల్ వాడకంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ 30 శాతం వరకూ తగ్గుతాయని అధ్యయన రచయిత డాక్టర్ అసఫ్ ఖురేషి పేర్కొన్నారు. రోజుకు 20 గ్రాముల రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తులను 60 రోజులు వాడితే టైప్ 1 డయాబెటిక్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ 30 శాతం తగ్గాయని, టైప్ 2 మధుమేహుల్లో 20 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని ఈ పరిశోధనలో వెల్లడైందని చెప్పారు.
బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్తో పాటు రైస్బ్రాన్ ఆయిల్ వాడిన మధుమేహ రోగుల్లో ట్రైగ్లిజరైడ్లుగా పిలిచే ప్రమాదకర కొవ్వులు కూడా తగ్గినట్టు గుర్తించామని తెలిపారు. ఢిల్లీలోని రెండు ప్రముఖ ఆస్పత్రుల్లో చేపట్టిన అధ్యయనాల్లోనూ ఇవే ఫలితాలు వెలుగుచూశాయి. నువ్వుల నూనెతో కలిపి రైస్బ్రాన్ ఆయిల్ను వాడిన వారిలో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఈ అధ్యయనం పేర్కొంది.